పవన్ కళ్యాణ్ ఫై పెద్దిరెడ్డి విమర్శలు

this-is-reason-for-palle-bata-says-peddireddi-ramachandra-reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. విశాఖ లో జరిగిన విశాఖ గర్జన సక్సెస్ కావడం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారని , అందుకే ఇలా దాడులు చేస్తున్నారని విమర్శించారు పెద్దిరెడ్డి. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు సీఎం వైయ‌స్ జగన్ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరాచక పాలన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్ న‌టిస్తున్నార‌ని ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు అన్ని ప్రాంతాల వాసులు మద్దతు తెలుపుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ..వైజాగ్ నుండి ప్రత్యేక విమానం లో విజయవాడకు బయలుదేరారు. కాసేపట్లో మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లనున్నారు. పవన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో విజయవాడలో జనసేన శ్రేణులు ఎక్కడ ఆందోళనకు దిగుతాయోనన్న భావనతో నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ వచ్చాక తన పర్యటనకు ఎదురైన అడ్డంకులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని పవన్ యోచిస్తున్నట్లుగా సమాచారం.