యూపీలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
ఓటు వేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ లో భాగంగా, గురువారం పూర్వాంచల్ ప్రాంతంలోని 57 స్థానాల్లో ఆరో దశ పోలింగ్ జరుగుతూఉంది. 11 గంటల వరకు 21.79 % పోలింగ్ నమోడు అయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. గోరఖ్పూర్ సిటీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన ఉదయాన్నే ఓటువేశారు.
బల్లియా నుంచి పోటీ చేస్తున్న యూపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఓటు వేశారు. ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉపేంద్ర తివారీ సైతం బల్లియాలో ఓటు వేశారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/