సిట్‌ ఎదుట హాజరైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఇటీవల ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి

pcc-chief-revanth-reddy-appears-before-sit

హైదరాబాద్‌ః టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు సిట్ ముందు హాజరయ్యారు. లీకేజీ విషయంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులివ్వగా.. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీసుకు ఆయన చేరుకున్నారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘సిట్ కాదు… సీబీఐ విచారణ కావాల్సిందే. టీఎస్ పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది’’ అని మరోసారి ఆరోపించారు. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న కెసిఆర్ – కెటిఆర్ అండ్ కో నియమించిన ‘సిట్’.. నన్ను విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. వెనక్కు తగ్గేదే లేదు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా’’ అని స్పష్టం చేశారు.