అక్కసుతో పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని తొలగించారుః లోకేశ్‌

జగన్‌ ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఎద్దేవా

lokesh

అమరావతిః టిడిపి నేత నారా లోకేశ్‌ పయ్యావుల కేశవ్‌ కు గన్‌మెన్లను తొలగించడంపై మండిపడ్డారు. సిఎం జగన్‌ ఉత్తరకొరియా నియంత్ కిమ్ ను మించిపోయారని నారా లోకేశ్ అన్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్నారని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారని విమర్శించారు.

వైఎస్‌ఆర్‌సిపి డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించారని మండిపడ్డారు. ఇప్పటికే జగన్ ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడించిన కేశవ్ తనకు అదనపు భద్రత కావాలని కోరితే… ఉన్న భద్రతను కూడా తొలగించారని అన్నారు. ఈ కక్ష సాధింపులతో వైఎస్‌ఆర్‌సిపి సర్కారు వేల కోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టేనని చెప్పారు. తక్షణమే కేశవ్ కు గన్ మెన్లను కేటాయించి, సెక్యూరిటీని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/