గరీబ్‌ కల్యాణ్‌ యోజన పొడిగింపు అభినందనీయం

తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన పవన్‌

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: నేడు తొలి ఏకాదశ సందర్భంగా ప్రతి ఒక్కరికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడి నూతనంగా ప్రవేశపెట్టిన వన్‌నేషన్.. వన్‌రేషన్‌ కోట్ల మంది వలస కార్మికులకు ఉపయోగపడుతుందని అన్నారు. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పొడగింపు, ఉచిత రేషన్‌ను నవంబర్‌ వరకు పొడగించడం అభినందనీయమన్నారు. ఉచిత రేషన్‌ 80 కోట్ల మంది భారతీయుల ఆకలి కేకలను తీర్చడానికి ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడికి ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/