పోసాని ఫై పిర్యాదు చేయబోతున్న పవన్ కళ్యాణ్..?

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్..పోసాని కృష్ణ మురళి ఫై పోలీసులకు పిర్యాదు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు , పవన్ స్నేహితుడైన త్రివిక్రమ్ ను వెంట పెట్టుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పోసాని ఫై పిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు.

మంగళవారం ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్ ఫై , ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు , జనసేన కార్య కర్తలు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ దగ్గరికి చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఒకానొక సమయంలో అక్కడి ఉద్రక్తత వాతావరణం చోటుచేసుకోవడం తో పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను అదుపులోకి తీసుకొని , పోసాని ని తమ వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకెళ్లడం జరిగింది.

పోసాని సైతం పవన్ కళ్యాణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అతని ఫ్యాన్స్ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకి ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ కారణమని పోసాని అన్నారు.