చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియజేసిన పవన్ కళ్యాణ్

Pawan-kalyan
Pawan-kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..టీడీపీ అధినేత చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన టెన్షన్ వాతావరణానికి దారితీసిన సంగతి తెలిసిందే. శుక్రవారం వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై జనసేన కార్యకర్తలు దాడి చేసారని , ఈ దాడి చేయించింది పవన్ కళ్యాణ్ అని వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తూ వారి ఫై కేసులు పెట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ను విశాఖ ను వదిలి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపట్ల చంద్రబాబు ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని, జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియజేసారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి, పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను ఖండించినందుకు కృతజ్ఞతలు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఫోన్లో సంభాషించారు. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని వెల్లడించారు.