పటమట లంకలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్
భారీగా తరలివచ్చిన అభిమానులు
Vijayawada: పటమట లంక లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు . పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చిన అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చి కార్ లో నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ వెళ్లారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/