పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు..షాక్ లో టీడీపీ శ్రేణులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసి..టీడీపీ శ్రేణులను అయోమయంలో పడేసారు. గతంలో వైస్సార్సీపీ పార్టీ ని ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని..పొత్తులకు మీము సిద్ధమని తెలిపిన పవన్ కళ్యాణ్..తాజాగా టీడీపీకి కొమ్ము కాయనని తేల్చి చెప్పారు. కేంద్రం – రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేసారు. తాను కులంను గౌరవిస్తాను కానీ, పిచ్చి లేదని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం ఉండి ఉంటే మూడో ప్రత్యామ్నాయంగా ఉండేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యంలో నాడు ఉంటూ వైఎస్సార్ కోవర్టులుగా పని చేసిన వారు నేడు మంత్రులుగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసి అయోమయంలో పడేసారు.

అధికార వైస్సార్సీపీ, టీడీపీ పార్టీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. వైస్సార్సీపీ, టీడీపీలతో కలిసి ముందుకు వెళ్లడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలని అభిప్రాయపడ్డారు. వైస్సార్సీపీ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉన్న కొంత మంది కోవర్టుల వల్లే తన అన్నయ్య, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నిలబెట్టుకోలేకపోయారని వివరించారు. ప్రజారాజ్యం పార్టీ ఉంటే రాష్ట్రంలో కచ్చితంగా ప్రత్యామ్నాయం ఉండేదన్నారు. తనను కూడా పార్టీలోకి రమ్మంటే రాను పొమ్మన్నానని పవన్ పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రులకు తాను భయపడనని.. ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. తాను ఎవరికీ భయపడనని.. తన ఆస్తులు లాక్కున్నా కూడా బలంగా నిలబడతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు , కార్య కర్తలతో పాటు జనసేన కార్య కర్తలు సైతం షాక్ లో పడ్డారు. నిన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో జనసేన , టీడీపీ కలిసి పనిచేస్తాయని..ఆలా పనిచేస్తే ఈజీ గా వైస్సార్సీపీ ని ఓడించవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ టీడీపీ తో కలిసేది లేదని తేల్చి చెప్పడం తో వారంతా షాక్ లో పడ్డారు. మరి దీనిపై పవన్ మరోసారి ఆలోచిస్తారా..లేక సింగిల్ గా బరిలోకి దిగుతారా అనేది చూడాలి.