వైస్సార్సీపీ నేతలకు చెప్పుతో వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

రీసెంట్ గా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన పరిణామాలు, జనసేన కార్య కర్తల అరెస్ట్ లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో మంగళగిరిలో భేటీ అయ్యారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భాంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైస్సార్సీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశానని… రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించా.. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

వెధవలు.. సన్నాసులు.. కొడకల్లారా అంటూ వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెప్పేదేంటి ? అని నిలదీశారు. కులాల పేరుతో కొందరు వైస్సార్సీపీ నాయకులు ఏపీలో చిచ్చులు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సభ్యత, సంస్కారం ఉన్న వాళ్లం కాబట్టి ఇన్నాళ్లూ తాము మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ ఇవాళ్టి నుంచి వైస్సార్సీపీ ఫై యుద్ధానికి సై అని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన సహనాన్ని చూశారని.. ఇక నుంచి యుద్ధమేనని అన్నారు. వైస్సార్సీపీ నీచుల సమూహం ఎక్కువగా ఉందని.. ప్రజల గురించి పట్టించుకునే నాయకుడే లేరని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.