దసరా నవరాత్రుల సందర్భంగా జనసేన ఆఫీస్ లో ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్

దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన ఆఫీస్ లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసారు. శుక్రవారం తెల్లవారుజామునే కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. ​అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ప్రార్థించారు.

అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబర్ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. త్వరలోనే జిల్లాలవారీగా సమీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ పట్టణాలతో ప్రారంభించనున్నామన్నారు. ముఖ్యంగా మంగళగిరిలో జరిగే ఈ సమావేశాలకు సంబంధించి సూచనలు చేశారు.