అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం బాధాకరం: పవన్

అమరావతి : సికింద్రాబాద్ బోయగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం కావడం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువు బారిన పడటం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/