గ్రేటర్ హైదరాబాద్ జనసేన కమిటీలకు పవన్ ఆమోదం
మొత్తం 50 డివిజన్లకు కమిటీల ఏర్పాటు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ కమిటీలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ఆ పార్టీ ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 50 డివిజన్లకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పింది. గత కొన్ని వారాలుగా ఈ ప్రక్రియ కొనసాగిందని వివరించింది. కమిటీల ఎంపిక కార్యకర్తల అభీష్టం ప్రకారమే జరగాలని పార్టీ అధ్యక్షుడు పవన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగినట్లు పేర్కొంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/