కాసేపట్లో సింగరేణి కాలనీకి పవన్ కళ్యణ్
మరికాసేపట్లో సింగరేణి బాధిత కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఇటీవల 6 ఏళ్ల చిన్నారి చైత్ర ను ఓ యువకుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ ప్రజానీకం భగ్గుమంటోంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటన ఫై చిత్రసీమ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మహేష్ , మనోజ్ , నాని తదితరులు ఈ ఘటన ఫై స్పందించగా..ఇక ఇప్పుడు సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మరికాసేపట్లో వస్తున్నారు. మరోపక్క పోలీస్ శాఖ సైతం నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.