ఆంధ్రప్రదేశ్ లో పాస్పోర్ట్ సేవలు ప్రారంభం
రోజుకు 3 గంటల పాటు పనివేళలు
Vijayawada : ఆంధ్రప్రదేశ్ లో పాస్పోర్ట్ సేవలు పునః ప్రారంభమయ్యాయి. విజయవాడలోని రీజియిన్ పాస్పోర్ట్ కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలతో సేవలను ప్రారంభించారు. రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు. సాధారణ రోజుల్లో రోజు కు సగటున 250 వరకు పాస్పోర్ట్ దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. ప్రస్తుత కోవిడ్ తరుణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కార్యాలయం పనిచేస్తుంది. రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్ కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/