విమానంలో సిబ్బందిపై ప్రయాణికుల దాడి

నొచ్చుకున్న ఎయిర్‌ ఇండియా సిబ్బంది

Air India airline
Air India airline

న్యూఢిల్లీ: ఒక్కొక్కసారి ప్రయాణికుల తీరు విమానయాన సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఓ విమానంలో ప్రయాణికుల తీరు విమర్శలపాలు చేసింది. అసలేం జరిగిందో కూడా తెలుసుకోకుండా ప్రయాణికులు సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ నుంచి ఓ ఎయిరిండియా విమానం ముంబయికి బయలుదేరింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ కాసేపటికే మళ్లీ విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టులో దించేశాడు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బంది పై దౌర్జన్యానికి దిగారు. కాక్ పిట్ డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నిం చారు. ప్రయాణికుల తీరు పై ఎయిరిండియా అధికారి ఒకరు సీరియస్ గా స్పందించారు. ‘ప్రయాణికుల తీరు ఏం బాగాలేదు. వారి భద్రత కోసమే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే విషయం తెలుసుకోకుండా దౌర్జన్యం చేస్తారా. ఇందుకు బాధ్యులైన ప్రయాణికుల పై చర్యలు తప్పవు’ అని వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/