స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో విశాఖ వాసులంతా పాల్గొనాలి

దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా విశాఖకు తొలి స్థానం దక్కే అవకాశం ఉంది

V. V. Lakshminarayana
V. V. Lakshminarayana

విశాఖపట్టణం: దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020లో విశాఖను ప్రతిపాదించి మొదటి స్థానంలో నిలబెట్టాలని విశాఖనగరవాసులకు సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారయణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియో పోస్టు చేశారు. విశాఖ ప్రజలందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే స్వచ్ఛంగా ఉన్న నగరాలకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో మనమంతా పాల్గొని మన నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా ప్రతిపాదించడానికి ఒక అవకాశం ఉంది. దీని కోసం మనం చేయాల్సింది ఇదే. మొదట స్మార్ట్ ఫోన్ లోని యాప్ స్టోర్ ద్వారా mohua swachhata  అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో సిటిజన్ సర్వే అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ 8 ప్రశ్నలకు సమాధానాలిస్తూ మన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. మనమంతా మన అభిప్రాయాలను పంపిస్తే.. మన నగరానికి స్వచ్ఛమైన నగరంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ సర్వేలో విశాఖవాసులంతా పాల్గొంటారని ఆశిస్తున్నాను అని లక్ష్మీనారాయణ విన్నవించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/