హైదరాబాద్‌ శివారులో చిరుత కలకలం

ఇంటిపై సేదతీరుతున్న పులి.. భయం గుప్పిట్లో జనం

Leopard enter house
Leopard enter house

షాద్‌నగర్‌: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి కలకలం రేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై సేద తీరుతుంది. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉంది. చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తుందని అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదిగో పులి ఇదిగో పులి అన్నట్టు మాత్రమే అందరూ అనుకున్నారు. కానీ నిజంగా చిరుతపులి షాద్ నగర్ పట్టణంలోని నగర నడిబొడ్డులో ప్రత్యక్షం కావడంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుమార్ ఇంటి పైన ఎలా చేరిందో తెలియదు కానీ దాబా పై తీరిగ్గా నిద్రిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఐ కృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి తదితర సిబ్బంది పటేల్ రోడ్డుకు చేరుకున్నారు. పటేల్ రోడ్డులో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు జనాలను కంట్రోల్ చేస్తున్నారు. ఏసిపి సురేందర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. మరికొద్ది సేపట్లో ఫారెస్ట్ అధికారులు రాబోతున్నారు. చిరుతపులి నిద్రొస్తోంది కాబట్టి ఎవరికీ ఏ హానీ జరగలేదు. పోలీసులు పూర్తి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జనాలను రానివ్వకుండా ఆంక్షలు విధించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/