ప్రధాని మోడికి పాకిస్థాన్‌ మహిళ రాఖీ

Pakistani Sister Sends ‘Rakhi’ To PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడికి పాకిస్థాన్‌ సోదరి కమర్ మొహిసిన్ షేక్ రాఖీ పంపారు. మోడి ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు కమర్‌ తెలిపారు. మోడికి గత 25 ఏళ్ల నుంచి మోదీకి రాఖీ కడుతున్నానని అప్పుడు మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని తెలిపారు. తన పట్టుదల, శ్రమతో మోడి ప్రధానమంత్రి వరకు ఎదిగారని ప్రశంసించారు. కాగా మోడిని తనతోపాటు తన భర్త మొహిసిన్‌, కుమారుడు సుఫీయాన్‌ కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. మోడి నుండి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని కమర్‌ చెప్పుకొచ్చారు. చాలా సార్లు మోడి, కమర్‌కు ఫోన్‌ చేసి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు. కమర్‌ భర్త, కొడుకు గురించి అడిగి తెలుసుకునే వారు. మోడి చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కమర్‌ కొనియాడారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోడికి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన కమర్‌ మొహిసిన్‌ భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వారు అహ్మదాబాద్‌లో ఉంటున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/