పాక్ తేలికగా భారత్పై విషం చిమ్ముతుంది
ఐరాస: ఐరాస వేదికగా భారతదేశంపై విషం చిమ్మడం పాకిస్థాన్ సర్వసాధారణం అయిందని భారత ప్రతినిధి నాగరాజు నాయుడు విమర్శించారు. ఐరాస కార్యనిర్వాహణపై సెక్రెటరీ జనరల్ నివేదికపై సర్వ ప్రతినిధి సభ సదస్సులో నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరుతెన్నులపై నిరసన వ్యక్తం చేశారు. ఒక చేప నీళ్లు తాగినంత తేలికగా పాకిస్థాన్ తరచూ భారత్పై విషం చిమ్ముతోందని, ఇది ఒక నైజంగా మారిందని నిప్పులు చెరిగారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/