పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా పరీక్షలు

ప్రధాని నుంచి శాంపిళ్లు సేకరించిన వైద్యులు..స్వీయ నిర్బంధంలోకి ఇమ్రాన్

Imran-Khan
Imran-Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ఈనెల 15న తేదీన ఇస్లామాబాద్‌లో ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎధిని కలిశారు. ఇమ్రాన్‌ను కలిసిన కొద్ది రోజులకే ఎధిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. లక్షణాలు నాలుగు రోజుల పాటు ఉండడంతో ఆయనకు పరీక్షలు చేయగా.. కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దాంతో అప్రమత్తమైన ఇమ్రాన్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అంతేకాక కరోనా పరీక్షల నిమిత్తం ఆయన నుంచి వైద్యులు శాంపిళ్లు సేకరించారు. వాటి ఫలితాలు ఈ రోజే వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ తెలిపారు.

pakistan-pm-imran-khan
pakistan-pm-imran-khan

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/