భారత్ నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లే వాహనాలకు పాక్ అనుమతి

ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్
50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపేందుకు సిద్ధమైన ఇండియా
భారత లారీలకు అనుమతి ఇచ్చిన పాక్

ఇస్లామాబాద్ :పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి. ఆహారం అందక అక్కడి ప్రజలు అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ఇండియా కూడా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అందించేందుకు రెడీ అయింది.

అయితే ఇవి ఆప్ఘనిస్థాన్ కు చేరాలంటే పాకిస్థాన్ గుండా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి వెళ్లే వాహనాలకు పాక్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి 500 లారీలు ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/