పాక్ చర్యలు ఎన్నటికి ఫలించవు
ఆర్మీ జనరల్ ఛీఫ్ మనోజ్ ముకుంద్
దిల్లీ: ప్రపంచదేశాలు కరోనాతో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని భారత ఆర్మి ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ అన్నారు. ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తుంటే భారత్ తన సొంత ప్రజలను కాపాడుకోవడమే కాక, ఇతర దేశాలకు కూడా ఔషధాలను వైద్యబృందాలను పంపిస్తు సాయం చేస్తుందని పేర్కోన్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద ఎగుమతి భారత్ను ఇబ్బంది పెట్టడానికే అని. అది ఎప్పటికి ఫలించదు అని స్ఫష్టం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/