కాబోయే సిఎం కెటిఆర్‌కు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ కార్యాలయంలో ప్రారంభోత్సవంలో డిప్యూట్‌ స్పీకర్‌ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కెటిఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని మరింత స్పష్టం చేశారు. కెటిఆర్‌ సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కెటిఆర్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సిఎం కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. త్వరలోనే ఆయన సిఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కెటిఆర్‌కు సిఎం అయ్యే అర్హ‌త‌లు ఉన్నాయ‌ని మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి పేర్కొన్న విష‌యం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/