గవర్నర్ కు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షేమపణలు తెలిపారు. గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెబుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం ఢిల్లీ లోని జాతీయ మహిళా కమిషన్ ఎదుట ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. కాగా గవర్నర్ తమిళిసై ఫై చేసిన ఆరోపణలకు క్షేమపణలు చెప్పారు. గవర్నర్ తమిళిసై కి కూడా లేఖ ద్వారా క్షమాపణ చెబుతానని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లైంది.