పాలకూర, పండుమిర్చి పచ్చడి

Paala koora, menti pachadi

కావలసిన పదార్థాలు
పాలకూర తరుగు – 3 కప్పులు
పండు మిరపకాయలు -6
చింతపండు – చిన్న నిమ్మకాయంత
జీలకర్ర- 1 టీ స్పూన్‌
ధనియాలు – 2 టీ స్పూన్‌లు
పసుపు – 1/4 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – 4 టీ స్పూన్‌లు
ఆవాలు, జీలకర్ర – 1/4 టీ స్పూన్‌
కరివేపాకు – 2 రెబ్బలు
తయారుచేయు విధానం : పాలకూర ఆకులు కడిగి ఆరబెట్టాలి. పండుమిర్చి తొడిమలు తీసి సన్నగా తరగాలి లేదా ముద్దలా చేసుకోవాలి. కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే పాలకూర, పండుమిర్చి గింజలు, నార తీసిన చింతపండు రెక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి. పూర్తిగా మెత్తబడ్డాక దింపి చల్లారనివ్వాలి. ముందుగా జీలకర్ర, ధనియాలు పొడి చేసుకుని పాలకూర మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి దింపి పచ్చడిలో వేసి కలపాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/