ముందు వచ్చేది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్!

ఆపై కొన్ని వారాలకు దేశవాళీ వ్యాక్సిన్

Oxford coronavirus vaccine to be called Covishield in India

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు ప్రయత్నలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో దేశవాళీ సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కన్నా ముందుగానే ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, స్థానికంగా తయారవుతున్న వ్యాక్సిన్ లను నిశితంగా గమనిస్తున్నామని, అవి కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని ఆయన అన్నారు.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు, దేశవాళీ వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి మధ్య కొన్ని వారాల గడువు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కే తొలుత అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని, ఈ వ్యాక్సిన్ ను పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ నిర్వహిస్తూనే భారీ ఎత్తున తయారు చేసే ప్రక్రియలో ఉందని తెలిపారు. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వంటి కంపెనీలు తొలి, రెండవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/