వైరస్ కట్టడి ప్రజల చేతుల్లోనే ఉంది..డబ్ల్యూహెచ్ఓ

భారత్‌లో కరోనా వైరస్‌ ఇంకా విజృంభించలేదు.. డబ్ల్యూహెచ్ఓ

WHO

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ భారత్‌లో ఇంకా విజృంభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)పేర్కొంది. అయితే, లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో, ఏ సమయంలోనైనా కరోనా వైరస్ విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించింది. తొలినాళ్లలో భారత్ తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తి కట్టడి జరిగిందని, కానీ దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇలాంటి తరుణంలోనే కరోనా వైరస్ తీవ్ర రూపు దాల్చుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు. భారత్ లో జనసాంద్రత ఎక్కువ అని, ఉపాధి కోసం ప్రజలు భారీ సంఖ్యలో కూలి పనులకు వెళుతుంటారని, వైరస్ వ్యాప్తి చెందడానికి ఇలాంటి పరిస్థితులే అత్యంత అనుకూలమని వివరించారు. లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో వైరస్ కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/