రామనవమి వేడుకల్లో విషాదం..ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు

Over 25 people fall in well at Mahadev Jhulelal Temple in Indore, rescue work on

ఇండోర్‌ః మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో రామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. పటేల్‌ నగర్‌ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో గురువారం రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలం లేక కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పై కూర్చున్నారు.

ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో బావిలో పడిపోయినవారిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.