చంద్రబాబు కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉంది
పచ్చ మీడియా తప్ప చంద్రబాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై వెఎస్సాఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రాలోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబునాయుడు కుటుంబం మాత్రమే సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండిపోయిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టింకోలేదన్నారు. ఇంకా ఇప్పటి దాకా దోచుకున్నది చాలాదా చంద్రబాబు? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ? అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/