పుల్వామాలో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలోని దుజన్ గ్రామంలో ఉగ్రవాదులు..భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సంఘటనా స్థలంలోనే మరికొందరు ఉగ్రవాదులు దాక్కునట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.ఈ క్రమంలోనే బలగాలను గమనించిన ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరగా.. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇస్తున్నాయి. ప్రస్తుతం మిగతా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/