ఒక్క రూపాయి డాక్టర్ ఇకలేరు
ఒక్క రూపాయి డాక్టర్ ఇకలేరు. పశ్చిమబెంగాల్ లో దాదాపు 60 ఏళ్ల పాటు కేవలం ఒక్కరూపాయికే ఎంతోమందికి చికిత్స అందించిన డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్(84) కన్నుమూశారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ఓ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. దాదాపు 60 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన సుషోవన్ బందోపాధ్యాయ్ను అక్కడి ప్రజలు ప్రేమగా ‘ఒక్కరూపాయి డాక్టర్’ అని పిలుస్తుంటారు.
సుశోవన్ బెనర్జీ చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించింది. 1984లో కాంగ్రెస్ టిక్కెట్పై బోల్పోర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగానూ సేవలందించారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ఆయన.. ఆ పార్టీకీ గుడ్బై చెప్పారు. 2020లో అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా ఆయన పేరు గిన్నిస్ వరల్డ్స్ రికార్డుల్లోకెక్కింది. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం పట్ల అంత దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుశోవన్ బందోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధాని మోడీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. డాక్టర్ సుషోవన్ బందోపాధ్యాయ్ ఎంతో మందికి రోగాలను నయం చేసిన గొప్ప వైద్యుడిగా, విశాల హృదయం కలిగిన వ్యక్తిగా ప్రజలకు గుర్తుండిపోతారని మోడీ పేర్కొన్నారు.