గచ్చిబౌలి లో కారు ఢీకొని ఒకరు మృతి
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద ఘటన
Hyderabad: గచ్చిబౌలి లో ఇవాళ తెల్లవారు జామున అతి వేగంగా వస్తున్న కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా రామచందర్(48) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/