జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి

వారంలో రెండో సారి గ్రనేడ్‌ దాడి చేసిన ఉగ్రవాదులు

terrorist attack in srinagar
terrorist attack in srinagar

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. గతవారం ఓ గ్రనేడ్‌ దాడి చేయగా, తాజాగా మరో దాడికి తెగించారు. శ్రీనగర్ సిటీలో లాల్ బజార్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఓ జవాను గాయపడ్డాడు. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వారంలో ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2న శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో రద్దీగా ఉండే మక్కా మర్కెట్ లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడంతో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లతోపాటు మరో ముగ్గురు పౌరులు కూడా గాయపడ్డారు. తరచూ ఉగ్రదాడులు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/