గుజరాత్ లో ఒమిక్రాన్ కేసు నమోదు

ఇటీవల కర్ణాటకలో రెండు కేసులు

గుజరాత్: భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించారు. అతడు ఆఫ్రికా దేశం జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చాడు. అతడి నుంచి నమూనాలు సేకరించి పూణే ల్యాబ్ కు పంపారు. అతడికి సోకింది ఒమిక్రాన్ కరోనా వేరియంట్ అని నిర్ధారణ అయింది. దేశంలో ఇది మూడో ఒమిక్రాన్ కేసు. కొన్నిరోజుల కిందట కర్ణాటకలో రెండు కేసులు నమోదు కావడం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/