ఎయిర్టెల్ వినియోగదారులకు ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారులకు ఎయిర్టెల్జీ5 సమ్మర్ బొనాంజా ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా రూ.149 అంతకంటే ఎక్కువ ప్యాక్లతో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు జీ5 ప్రీమియం ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్రయోజనాలను ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2018లో ఎయిర్టెల్ తమ ఖాతాదారులకు ఉచితంగా జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందించింది. అలాగే, ఇటీవల కొన్ని రీచార్జ్ ప్లాన్లపై ఓవర్దిటాప్ (ఓటీటీ) సేవలను కూడా అందించింది. ఎయిర్టెల్ బ్రాండ్బ్యాండ్, పోస్టుపెయిడ్ ఖాతాదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/