నవంబర్‌ 30 వరకు ఒడిశాలో లాక్‌డౌన్‌!

odisha-government-extends-covid 19-lockdown-in-containment-zones-till-30th-november

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో లాక్‌డౌన్ గ‌డువును మ‌రింత పొడిగించాల‌ని ఒడిశా ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని కంటైన్‌మెంట్ జోన్‌ల‌కు ఈ లాక్‌డౌన్ పొడిగింపు వ‌ర్తిస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదేవిధంగా న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లను మూసే ఉంచాల‌ని ఒడిశా ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే, 9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్రం న‌వంబ‌ర్ 16 నుంచి ఆయా పాఠ‌శాల‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టంచేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/