గోవుల రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్
ఆవుల లారీ ని పోలీస్ స్టేషన్ లో అప్పగింత
Hyderabad: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డుకున్నారు.
మహారాష్ట్ర నుంచి అక్రమంగా బహదూర్పుర కు తరలిస్తోన్న ఆవుల లారీని వెంబడించి చౌటుప్పల్ చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు.
అనంతరం ఆ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు డబ్బులకు అలవాటుపడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/