ఒబామా మరోసారి విమర్శలు
పరిస్థితులన్నీ తారుమారయ్యాయని ఆందోళన
అమెరికా అధ్యక్షునిపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ధ్వజమెత్తారు.
అయితే నేరుగా అధ్యక్షుని పేరు పెట్టి ప్రస్తావించకుండా.. ‘అనేక మంది తమను ఇన్చార్జీలుగా చెప్పుకుంటున్నా.. తామేం చేస్తున్నదీ వారికే తెలియదు’ అని ఒబామా అన్నారు.
ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఒబామా… నల్ల జాతీయు లపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు.
కరోనా మహమ్మా రి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందన్నారు.
పరిస్థితులు అన్నీ తలకిందులయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా ‘నాడి వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/