నూపుర్ శ‌ర్మ‌కు స‌మ‌న్లు జారీ : కోల్ క‌తా పోలీసులు

న్యూఢిల్లీ: మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బహిష్కృత బీజేపీ నేత నూపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20న హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ మాజీ నేత కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శర్మపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి శర్మపై బెంగాల్‌లోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఇదిలా ఉండగా నూపుర్‌ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశంలోని పలు నగరాల్లో నిరసనలు జరగ్గా.. హింసాత్మకంగా మారాయి. బెంగాల్‌లోని అనేక నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. నదియా జిల్లాలోని బెతువదాహరి స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు లోకల్ రైలుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో స్టేషన్‌లోని కొంతమంది సిబ్బంది, కృష్ణానగర్-లాల్గోలా లోకల్ రైలులోని ప్రయాణికులు గాయపడ్డారని తూర్పు రైల్వే అధికారి తెలిపారు. అయితే, గత రెండు రోజులుగా హౌరా, ముర్షిదాబాద్‌ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉన్నది. హౌరాలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/