అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్న ఎన్టీఆర్ బొమ్మ తో కూడిన రూ.100 నాణెం

తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి గుడ్ న్యూస్. అతి త్వరలో ఎన్టీఆర్ బొమ్మ తో కూడిన రూ.100 నాణెం అందుబాటులోకి రాబోతుంది. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు బొమ్మతో కూడిన వెండి రూ. 100 నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వంద రూపాయాల నాణెం పూర్తిగా వెండితో తయారు చేయనున్నారు.

ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె , మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపించారు. ఈ నాణెంపై సలహలు, సూచనలు కోరారు. 2022 మే 28వ తేదీ నుండి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ వెండి నాణెన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.