ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్‌లో లిఫ్ట్ వైర్ తెగడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడిపోయింది. దీంతో లిఫ్ట్‎లో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి వెళుతున్నారు. పైకి వెళుతున్న లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవటంతో.. స్పీడ్ గా లిఫ్ట్ కిందకు పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. విధులకు హాజరైన ఉద్యోగులు, సిబ్బంది పై అంతస్తులకు లిఫ్ట్ లో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వీటిపీఎస్ లోకి ఇతరులు ఎవర్నీ అనుమతించటం లేదు. మీడియాను లోపలికి రానివ్వటం లేదు. కేవలం ప్రమాదం వార్తను మాత్రం బయటకు చెబుతోంది యాజమాన్యం. గాయపడిన కార్మికులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.