అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా జూ. ఎన్టీఆర్
బింబిసార తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ..ఇప్పుడు అమిగోస్ మూవీ తో ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో హీరో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో త్రిపాత్రాభినయం చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు , టీజర్, బాలయ్య నటించిన ధర్మ క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అంటూ సాగే రీమిక్స్ సాంగ్ , ట్రైలర్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచాయి. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకు సిద్దమవుతుంది. రేపు హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ గా జూ. ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించి మరింత అంచనాలు పెంచారు. రేపు సాయంత్రం 5 గంటలకు JRC కన్వెన్షన్ లో ఈ వేడుక అట్టహాసంగా జరగబోతుంది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎలా మాట్లాడతారో వినాలని అంత ఎదురుచూస్తున్నారు.