ముంబై చెక్కేసిన ఎన్టీఆర్ ..ఎందుకో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై చెక్కేసాడు.ఎందుకో తెలుసా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. గురువారం రిలీజ్ అయినా ట్రైలర్ కు అన్ని భాషల్లో మంచి స్పందన వస్తుంది. సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ అద్భుతంగా ఉందని కితాబు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటె..గురువారం సాయంత్రం ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ ముంబై చెక్కేసాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ,.. జనవరి 7న ఈ చిత్రం విడుదలవుతోందని… హిందీ ఆడియన్స్, విమర్శకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నారు. మన దేశంలోని పెద్ద స్టార్లతో కలిసి పని చేయాలనేది తన కోరిక అని అన్నారు. కరోనా వల్ల భారతీయ సినిమా కోల్పోయిన వైభవాన్ని ఈ చిత్రం మళ్లీ తీసుకొస్తుందని చెప్పారు.