బాధితురాలి వివరాలను రఘునందన్ వెల్లడించడం నేరమే : రేణుకా చౌదరి

తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోయాయి..రేణుకా చౌదరి

హైదరాబాద్ : తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. పసిపిల్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఒక్క రోజే ముగ్గురు మైనర్లపై అత్యాచారాలు జరిగితే… పోలీసులు, షీమ్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ బాధితురాలి వివరాలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు బయటపెట్టడం సరైన చర్య కాదని అన్నారు.

అత్యాచార బాధితురాలి వివరాలను వెల్లడించడం నేరం చేయడమేనని చెప్పారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంలో తప్పు లేదని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి పదవి నుంచి మహమూద్ అలీ తప్పుకోవాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/