నగదు బదిలీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి
ఉచిత విద్యుత్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
అమరావతి: రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో సిఎం జగన్ వెనకడుగు వేయరని వైఎస్ఆర్సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవడమే సిఎం అభిమతమని తెలిపారు. ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. వాస్తవానికి ఉచిత విద్యుత్ అనేది ఎవరో పోరాడి సాధించుకున్నది కాదని… దివంగత వైయస్ తీసుకొచ్చిన పథకమని చెప్పారు. పెరిగిన కరెంటు చార్జీలపై నిరసన చేస్తున్న వారి ప్రాణాలు తీసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. వైయస్ ఆలోచనలతో పుట్టిన ఉచిత విద్యుత్ పథకానికి ఆటంకం కలగదని సజ్జల చెప్పారు. ఉచిత విద్యుత్ వైయస్ పేటెంటైతే… ఊరూరా బెల్టు షాపులు చంద్రబాబు పేటెంట్ అని అన్నారు. కాఆ ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టిడిపి చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని రామకృష్ణారెడ్డి కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/