బడ్జెట్ పై స్పందించిన రాహుల్ గాంధీ

వేతన జీవులకు మొండిచేయి చూపారన్న రాహుల్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బడ్జెట్ పై స్పందించారు. మోడీ సర్కారు ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని అంటూ విమర్శించారు. వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, నిర్మలా సీతారామన్ కొన్ని రంగాలను సంతృప్తి పరచలేకపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, వేతన జీవులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరట లేదు. వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోగా, పన్నుశ్లాబుల్లోనే మార్పు లేదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేలుగానే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బడ్జెట్ పై స్పందించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/