రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూపాయి కూడా ఆదా కాలేదు

కాంట్రాక్టర్లకు మేలు చేసేలా సీఎం జగన్‌ పాలనా ఉంది

bonda umamaheswara rao
bonda umamaheswara rao

అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా వాస్తవం కాదని టిడిపి నేత బొండా ఉమా అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో ఒక్క రూపాయి కూడా ఆదా కాలేదని చెప్పారు. కాంట్రాక్లర్లకు మేలు చేసేలా ముఖ్యమంత్రి జగన్‌ పాలనా ఉన్నదని విమర్శించారు. కేవలం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కోసమే విశాఖను రాజధాని చేస్తానంటున్నారని చెప్పారు. టిడిపి హయంలో 54 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇచ్చామని..జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అకారణంగా 7లక్షల మందికి పెన్షన్లును తొలగించారని బొండా ఉమ మండిపడ్డారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం పేదల కడుపు కొడుతుందని దుయ్యబట్టారు. పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/