‘అజేయమైన’ మిలిటరీని నిర్మిస్తాం : కిమ్

ప్యోంగ్‌యాంగ్‌: అజేయ‌మైన శ‌క్తి క‌లిగిన‌ సైన్యాన్ని నిర్మించ‌నున్న‌ట్లు నార్త్ కొరియా నేత కిమ్ జాన్ ఉంగ్ తెలిపారు. ఉత్త‌ర కొరియా అవ‌లంభిస్తున్న విధానాల‌పై అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు ఇత‌ర దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నా.. కిమ్ నేతృత్వంలోని ఆ దేశం త‌న అణ్వాయుధ సంప‌త్తిని పెంచుకుంటూనే పోతోంది. ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఆయుధాల‌ను స‌మీక‌రిస్తున్నామ‌ని, యుద్ధం చేయ‌డానికి కాదని కిమ్‌ అన్నారు.

తాజాగా జ‌రిగిన డిఫెన్స్‌ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆ షోలో ర‌క‌ర‌కాల క్షిప‌ణుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌ల బాలిస్టిక్‌, క్రూయిజ్‌కు చెందిన వివిధ మిస్సైళ్ల‌ను ఉత్త‌ర కొరియా ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. వాటిల్లో హైప‌ర్‌సోనిక్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లు కూడా ఉన్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/