ఉత్తర కొరియాను వణికిస్తున్న జ్వరం..21 మంది మృతి

ప్యాంగాంగ్‌: ఉత్తర కొరియాను జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్‌ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్‌తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ అయింది. తాజాగా మరో 21 మంది జర్వానికి బలయ్యారు. కాగా, వీరి మరణానికి కారణం కరోనానా లేదా మరోటా అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. అయితే దేశంలో మొదటిసారిగా మే 12న తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఉత్తర కొరియాలో ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య 2,80,810కి చేరింది. జర్వంతో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూడు దశల్లో విళయతాండం చేసినప్పటికీ కొరియాలో మాత్రం ఒక్క కేసూ నమోదవలేదు. అయితే తాజా పాజివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతోపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. గతంలో కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సిన్లను అందిస్తామని డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించాయి. అయితే కిమ్‌ దానికి ఒప్పుకోలేదు. ఉత్తర కొరియా ప్రజలు ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటారని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/